ఆదికాండము 4 వ అధ్యాయం కయీను, హేబేలు సోదరుల విషాద కథను వర్ణిస్తుంది. కయీను, హేబేలు ఆదాము హవ్వల నుండి జన్మించారు. హేబేలు గొర్రెల కాపరి; కయీను ఒక రైతు. కాలక్రమేణా, కయీను, హేబేలు దేవునికి నైవేద్యాలను సమర్పించడం ప్రారంభించారు. హేబేలు అర్పణలతో ప్రభువు సంతోషించాడు. అయినప్పటికీ, కయీను అర్పణలను దేవుడు లక్ష్యపెట్టలేదు. ద్వేషం, కోపం మరియు పాపం యొక్క భయంకరమైన పరిణామాల గురించి దేవుడు కయీనును హెచ్చరించాడు. దేవుని హెచ్చరిక ఉన్నప్పటికీ, కయీను తన సోదరుడు హేబేలును చంపాడు. కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు ఆదాము హవ్వలకు షేతును ఇచ్చాడు.
Comments
Post a Comment